నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ భారీ విజయాన్ని అందుకుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఆ సినిమాకి సీక్వెల్ గా ‘కార్తికేయ-2’ రూపొందింది. అభిషేక్ అగర్వాల్.. విశ్వప్రసాద్.. వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది మూవీ యూనిట్.
అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. లిరికల్ సాంగ్ కాకుండా డైరెక్ట్ వీడియో సాంగ్ను యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్ చేయనున్నట్లు వారు తెలిపారు. అదే విషయంమీద మూవీ మేకర్స్ నిన్న ఈ లవ్ సాంగ్ సంబంధించి ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. “నన్ను నేను అడిగా అనే టైటిల్ తో ఈ మెలోడియస్ వీడియో సాంగ్ను కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ నెల 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావలసింది. కానీ ఆగస్టు మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు నిఖిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.