Wednesday, May 1, 2024

ఎన్టీఆర్ తో ఫోన్ లో మాట్లాడిన మెగాస్టార్…!!

ఇటీవల కాలంలో సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. అంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే ఈరోజు చేసిన పరీక్షలలో అల్లు అర్జున్ కు నెగిటివ్ వచ్చింది. కాగా ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఐసోలేషన్ లోనే ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ కు పాజిటివ్ రావడంతో అభిమానులు అంతా కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ ఆరోగ్యంపై తాజాగా ఓ ట్వీట్ చేశారు. తాను స్వయంగా మాట్లాడి బాగోగులు తెలుసుకున్నానని తెలిపారు. తారక్ ఆరోగ్యం బాగానే ఉందని తన కుటుంబసభ్యులు కూడా బాగానే ఉన్నారని తెలిపారు మెగాస్టార్. తారక్ ఉత్సాహంగా ఎనర్జిటిక్ గా ఉన్నాడని తెలిసి తాను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానని చిరంజీవి చెప్పారు. అలాగే తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement