Sunday, April 28, 2024

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కనువిందు చేసిన తారక్-చెర్రీ

తెలుగు తెరపై అతిపెద్ద గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ (కర్టెన్ రైజర్)కు ముఖ్య అతిథి తన సోదరుడు రామ్ చరణ్ అని ఎన్టీఆర్ వెల్లడించారు. జెమినీ టీవీలో ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రోమోను పంచుకున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ జరిగిందని, ప్రేక్షకులకు ఎంతో వినోదం లభిస్తుందని వివరించారు. ఇక ప్రోమో లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒకేసారి ఎంట్రీ ఇవ్వడంతో స్టార్ట్ అవుతుంది. చరణ్ ఎన్టీఆర్ సీట్లో కూర్చోడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ అదేంటి అది నా సీటు.. నీ సీటు హాట్ హాట్ గా ఉంటుంది అక్కడ అని అంటాడు. ప్రోమో అద్యాంతం ఆసక్తికర సంభాషణలతో ఎన్టీఆర్ చరణ్ మంచి జోష్ నింపారు.

https://youtu.be/SINxvviCKTo

ఇది కూడా చదవండి: లార్డ్స్ టెస్ట్: కోహ్లీ, రోహిత్, రాహుల్ అవుట్

Advertisement

తాజా వార్తలు

Advertisement