Wednesday, May 1, 2024

భర్తతో మాల్దీవుల్లో ఎంజయ్ చేస్తున్న మంచు లక్ష్మి

సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఏం పోస్ట్ చేసినా సరే అవి వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. అదే హీరోయిన్స్ విషయానికి వస్తే అది మరింత వేగంగావైరల్ అవుతూ ఉంటాయి. కాగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఆ ఫోటోలలో మంచు లక్ష్మి తో పాటు ఆమె భర్త కూడా ఉన్నారు.

తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ టూర్ వెళ్లిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా మంచు లక్ష్మీ షేర్ చేసింది. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రెటీలు కాస్త టైం దొరికినా సరే మాల్దీవులకు చెక్కేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి కూడా తన తండ్రి మోహన్ బాబు, కూతురు విద్యా నిర్వాణ, భర్త ఆండీ శ్రీనివాసన్‌లతో మాల్దీవులలో ఎంజాయ్ చేశారు.

https://www.instagram.com/p/CNH8c5sFDp5/?igshid=1ruktsvcjgv22
Advertisement

తాజా వార్తలు

Advertisement