Saturday, May 18, 2024

తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న యమదొంగ హీరోయిన్

సినీ అభిమానులకు మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట తెలుగు ప్రేక్షకులకు సింగర్ గా పరిచయం అయిన ఈ అమ్మడు తరువాత హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా టైటిల్ సాంగ్ పాడిన మమతా ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా అంటూ సూపర్ హిట్ సాంగ్ ని పాడారు. అయితే సింగర్ గా సక్సెస్ అయింనంత రేంజ్ లో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది.

తెలుగు లో యమదొంగ, చింతకాయల రవి, కేడి సినిమాలు చేసింది మమత. ఆ తరువాత ఈ అమ్మడికి ఎక్కడా అవకాశాలు రాలేదు. గతంలో క్యాన్సర్ బారినపడిన ఈ అమ్మడు దానిని జయించి మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. కానీ తమిళం మలయాళంలో మాత్రమే సినిమాలు చేసింది. కానీ తెలుగులోకి మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రశాంత్ మురళి పద్మనాభన్ దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం లాల్ భాగ్ అనే చిత్రంలో నటిస్తోంది మమత. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement