Monday, May 6, 2024

Update | “డబుల్ ఇస్మార్ట్” నుండి లేటె్ట్ అప్డేట్..!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో యాక్షన్ ఎంటర్టైనర్ స్కందలో నటిస్తున్నారు. ఈ మూవీ త‌రువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పూరీ జగన్నాధ్‌తో జతకట్టనున్నట్లు ఇటీవల ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ ఇస్మార్ట్ శంకర్ థియేట‌ర్ల వద్ద సంచలన విజయం సాధించింది. కాగా, ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వీరిద్దరు డబుల్ ఇస్మార్ట్ మూవీ తీయ‌నున్నారు.

- Advertisement -

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అద్భుతమైన అప్డేట్ రేపు ఉదయం 11:11 గంటలకు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్‌తో పెద్ద హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని మునుపటి ప్రాజెక్ట్ లైగర్ భారీ నిరాశను మిగిల్చింది. దీంతో డబుల్ ఇస్మార్ట్ తో మంచి కంబ్యాక్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాగా.. ఇది 8 మార్చి 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. ఇక‌ ఈ సినిమాని పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement