Monday, April 29, 2024

అర్జున్ రెడ్డి తో రొమాన్స్ కి కత్రినాకైఫ్ రెడీ

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఓ స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినాకైఫ్ నటించబోతుందట.

అంతేకాదు ఇటీవల ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ ను ఫాలో అవ్వడం కూడా మొదలు పెట్టింది కత్రినాకైఫ్. సోషల్ మీడియా లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ ఎప్పటినుంచో ముందు వరుసలో ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి లైగర్ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement