Tuesday, April 30, 2024

జూనియర్​ ఎన్టీఆర్, అల్లు అర్జున్​ కాంబోలో మల్టీస్టారర్​ మూవీ.. వివరాలు ఇవే..​

RRR విజయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పుష్ప ది రైజ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి పెంచారు. టాలీవుడ్ స్టార్లు కాస్త గ్లోబల్ స్టార్ లు అయిపోయారు. కాగా, బీటౌన్ రూమర్స్ ప్రకారం.. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి భారీ బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీలో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది. పౌరాణిక ఇతిహాసం అధారంగా తెరకెక్కే ఓ పాన్-ఇండియా మూవీ కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ పరిశీలనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు సమాచారం. ఈ భారీ బడ్జెట్ మూవీని స్టూడియోస్ నిర్మించనుండగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ గురించేనన్న విషయం చాలామంది చెబుతున్నారు. అయితే దీని గురించి ఇదివరకు కూడా చర్చలు జరగగా.. మెదట బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఎంపకయ్యాడు. ఆ తరువాత.. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చిరంజీవి అశ్వత్థామగా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, రణవీర్ కూడా ఇప్పుడు ఈ మూవీ నుండి తప్పుకున్నాడని, ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చేతుల్లోకి రానుందని ఇటీవలి నివేదికల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement