Sunday, May 5, 2024

హోమ్ క్వారంటైన్ లో వకీల్ సాబ్

దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పడ్డారు. కాగా తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో కి వెళ్లినట్టు తెలుస్తోంది.

పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా పవన్ కి క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు జనసేన నేతలతో కూడా టెలీ కాన్ఫరెన్స్ లోనే పవన్ మాట్లాడుతున్నారని సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ గత ఏడాది కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement