Monday, May 6, 2024

పూరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నితిన్ తోనేనా ?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత పూరి ఎవరితో సినిమా చేయబోతున్నాడనే దానిపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమాను నితిన్ తో చేయబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో హార్ట్ ఎటాక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక మొదట పూరి జగన్నాథ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నప్పటికీ వారంతా బిజీగా ఉండటంవల్ల నితిన్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement