Thursday, May 2, 2024

హీరోననే సంగతి మరిచిపోయా…కార్తీ

శుక్రవారం కార్తీ నటించిన సుల్తాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు హీరోని అనే సంగతి మర్చిపోయి థియేటర్ లో ఎంజాయ్ చేశానన్నారు కార్తీ. ఆదివారం హైదరాబాదులో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ కుటుంబ ప్రేక్షకులు సినిమాని చక్కగాఆదరిస్తున్నారన్నారు. కరోనా భయం ఉన్నప్పటికీ సినిమా చూడడానికి థియేటర్లకు వస్తుండటం ఆనందంగా ఉందన్నారు.

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని… వల్గారిటీ లేకుండా మంచి ప్రేమకథగా ఆకట్టుకుంటూనే, రౌడీలను మార్చే సందేశానికి వ్యవసాయంను జోడించి ఎంతో చక్కగా చూపించరని అందరూ ప్రశంసిస్తున్నారాని అన్నారు. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement