Monday, April 29, 2024

ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. పాపం..శృతిహాసన్!!

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా మామూలుగా హీరోయిన్ లు సంపాదనలో కాస్త స్పీడ్ గానే ఉంటారనే విషయం తెలిసిందే. కానీ లాక్ డౌన్ సమయంలో మాత్రం శృతిహాసన్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతోంది. లాక్ డౌన్ కు ముందు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. దాంతో పాటు మరికొన్ని దానికి కూడా ఈఎంఐలు కట్టాల్సి ఉంది.

కానీ లాక్ డౌన్ కారణంగా చేతిలో డబ్బు లేదు. ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టినా వెళ్లి పని చేయాలనుకున్నాను. అమ్మ నాన్న లకు డబ్బు అడగడం మానేసి చాలా కాలం అయ్యింది. అందుకే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా కంటే ఎక్కువ కష్టాలు పడిన వారు చాలా మంది ఉంటారనే విషయం కూడా నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement