Monday, May 6, 2024

అధిక మోతాదులో నిద్ర‌మాత‌లు మింగిన న‌టి – త‌ప్పిన ప్రాణాపాయం

హీరోయిన్ భామ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిని కొట్ట‌పారేసిందీ భామ‌. పొర‌పాటున అధిక మోతాదులో నిద్ర మాత్ర‌లు తీసుకోవ‌డం వ‌ల్లే ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఇన్ స్టా గ్రామ్ లో ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌పై చూపిస్తున్న ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాల‌ని తెలిపింది. అయితే 2017నాటి న‌టిపై వేధింపుల కేసును పోలీసులు తిరిగి విచారిస్తుండ‌టం వ‌ల్లే ఆమె భ‌య‌ప‌డి అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు ప్రచారం జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆమె కొచ్చి ఆసుపత్రిలో చేరడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement