Wednesday, May 1, 2024

మైసూర్ లో.. శ్రీలీల‌తో హీరో రామ్

హీరో రామ్ బోయ‌పాటి శీను డైరెక్ష‌న్ లో ఓ యాక్ష‌న్.. ఎంట‌ర్ టైనర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రీకరించడానికి టీమ్ అంతా మైసూర్ చేరుకుంది. రామ్ – శ్రీలీలపై ఈ పాటను చిత్రీకరించనున్నారు.ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పాటను షూట్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్రని బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పోషించనున్నార‌ట‌. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో దసరాకి విడుదల చేయనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను ఇటీవలే చిత్రీకరించారు.అందుకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను 24 రోజుల పాటు చిత్రీకరించినట్టు రామ్ చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement