Thursday, April 25, 2024

కరోనా రోగులకు హీరో అడవి శేషు సహాయం

కరోనా నేపథ్యంలో ఎంతోమంది రోడ్డున పడుతున్నారు. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు కొంత మంది సినీ స్టార్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా హీరో అడవి శేషు కరోనా బాధితులకు అండగా నిలిచారు. హైదరాబాదులోని కింగ్ కోటి ఆసుపత్రిలో పేషెంట్లు, వైద్యులు ఇతర సిబ్బంది మొత్తం కలిసి 300 మంది వరకు ఆస్పత్రిలో ఉన్నారు. కాగా ఆస్పత్రిలో తాగునీరు కొరత ఏర్పడింది ఒక్కసారిగా తాగునీరు అయిపోవడంతో రోగులు వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఎండాకాలం కావడంతో ఆస్పత్రిలో ఉన్న చాలామంది డీహైడ్రేషన్ బారిన పడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అడవిశేషు తక్షణమే ఎనిమిది వందల యాభై లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ ను ఆసుపత్రికి పంపించారు. ఇక అడవి శేషు చేసిన సహాయం వల్ల 300 మందికి సకాలంలో మంచినీరు అందింది. ఇదే కాకుండా ఇంకా ఏమన్నా సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని ఆసుపత్రి వర్గాలకు అడవిశేషు తెలిపారట. దీనితో అడవి శేషు పై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement