Saturday, May 4, 2024

మనీ లాండరింగ్ కేసు: యామీ గౌతమ్ కు రెండోసారి ఈడీ నోటీసులు..

మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిందని బాలీవుడ్ నటి యామీ గౌతమ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులిచ్చింది. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ – ఫెమా ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ యామీ గౌతమ్ కు రెండవ సారి నోటీసులిచ్చింది. ఆ కేసును జోన్ 2 అధికారులు విచారిస్తున్నారు. బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలపై ఇప్పటికే ఈడీ నిఘా పెట్టింది. విదేశీ లావాదేవీలపై ఓ కన్నేసి పెట్టింది. కాగా, ఇటీవలే బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘ఉడీ’ దర్శకుడు ఆదిత్య ధర్ ను యామీ వివాహం చేసుకుంది. విక్కీ డోనర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం.. ‘ఎ థర్స్ డే’ అనే థ్రిల్లర్ మూవీని చేస్తోంది. షూటింగ్ లో బిజీగా ఉంది. హృతిక్ హీరోగా రూపొందిన కాబిల్, వరుణ్ ధావన్ బద్లాపూర్ లలోనూ ఆమె మెరిసింది.

ఇది కూడా చదవండి: ఆచార్య లేటెస్ట్ అప్డేట్ !!

Advertisement

తాజా వార్తలు

Advertisement