Sunday, April 28, 2024

నారప్ప ఓటీటీ రిలీజ్ పై వెంకీ ఏమనన్నాడో తెలుసా ?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై నిన్నటి వరకు సందిగ్ధత నెలకొనగా ఆఖరికి సినిమాను ఓ టి టి లో రిలీజ్ చేయబోతున్నాం అని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఇదే విషయంపై స్పందించిన వెంకీ… శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ నారప్ప ను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాకు, చిత్ర బృందానికి మీ పై చాలా ప్రేమ ఉన్నాయి. అభిమానులు అలాగే ప్రేక్షకులు ఈ సినిమాను కంఫర్ట్ అండ్ సేఫ్టీ గా ప్రియమైన వారితో చూడండి. జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది అంటూ ట్వీట్ చేశాడు. కాగా నారప్ప ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement