Sunday, May 5, 2024

ఆది జోడిగా దిగంగన..

నిర్మాత కె.రాధామోహన్‌ తన తాజా చిత్రాన్ని ఆది సాయికుమార్‌తో రూపొందిస్తున్నారు. ఇది కుటుంబనేపథ్య చిత్రం. వినోదానికి ప్రాధాన్యత ఉంటుంది. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రానికి ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగనా సూర్యవంశీని ఖరారు చేశారు. తెలుగు, హిందీ భాషలలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న దిగంగన ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ సినిమాలో నటించడం పట్ల చిత్ర యూనిట్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందిస్తుండగా, సతీష్‌ ముత్యాల కెమెరా బాథ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి గిడుతూరి సత్య ఎడిటర్‌గా, కొలికపోగు రమేష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌, ఫైట్స్‌ రామకృష్ణగా వ్యవహరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement