Saturday, April 27, 2024

లైగర్ ఓటీటీ ఆఫర్ పై దేవరకొండ రియాక్షన్!!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చిందట. రిలీజ్ తో పాటు అన్ని భాషల సాటిలైట్ రైట్స్ కోసం 200 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ను ప్రకటించిదట.

అయితే దీనిపై విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా స్పందించారు. లైగర్ కోసం వచ్చిన ఓటీటీ ఆఫర్ చాలా తక్కువ అంటూ తెలిపాడు. నేను థియేటర్లలో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తాను అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు హైదరాబాదులో నెక్స్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement