Thursday, May 2, 2024

MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ రీ-రిలీజ్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2013లో రిలీజ్ అయిన‌ కైపోచే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. తన మొదటి హిందీ సినిమా విజయం తర్వాత, నటుడు అనేక సినిమాల్లో నటించాడు. ఆ త‌రువాత భారత అత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్, క్రీడా దిగ్గజం M.S. ధోని బ‌యోపిక్ “MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ”లో న‌టించాడు. ఈ సినిమా సుశాంత్ సినీ కెరీర్‌లో దాదాపు ఒక‌ మలుపు రాయి లాంటిది. ఈ బయోపిక్‌లో భారత క్రికెటర్ ఎంఎస్ ధోని పాత్రను పోషించాడు.. ఈ సినిమాలో అతని నటనతో ఎంద‌రో ప్రేక్ష‌కులు, అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కియారా అద్వానీ, దిశా పటానీ, భూమికా చావ్లా , అనుపమ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు..

కాగా, థియేటర్లలో రిలీజ్ అయిన‌ 7 సంవత్సరాల తర్వాత, ఈ మూవీ థియేట‌ర్ల‌లో హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో రీ-రిలీజ్ అవ్వ‌డానికి సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. “జబ్ మహి ఫిర్ పిచ్ పే ఆయేగా, పురా ఇండియా సిర్ఫ్ “ధోనీ! ధోనీ! ధోనీ!” చిల్లాయేగా. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ మే 12న సినిమాల్లో రీ-రిలీజ్ కానుంది” అంటూ ప్ర‌క‌టించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement