Sunday, April 28, 2024

కరోనా ఎఫెక్ట్… రాధే శ్యామ్ వాయిదా ?

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకుతీసుకురాబోతున్నామని చిత్రయూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే మరో వైపు కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. కాగా ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు రాధే శ్యామ్ ను ఇబ్బంది పెడుతోంది.

ప్రస్తుతం ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న రాధేశ్యామ్ పై ఎఫెక్ట్ బాగానే పడిందట. వీఎఫ్ ఎక్స్ పై ఈ ప్రభావం పడడం తో ఆ పనిని ముంబై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చెయబోతున్నారట. ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభాస్ సినిమా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అన్ని సెట్ అయి రిలీజ్ చేస్తారనుకున్న టైంలో కరోనా దెబ్బకు రాధే శ్యామ్ రిలీజ్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement