Friday, March 29, 2024

బీఆర్కేఆర్ భవన్ లో కరోనా కలకలం..

హైదరాబాద్ : కరోనా మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కాగా నగరంలోని బీఆర్కేఆర్ భవన్‌లో కరోనా కలకలం రేపుతోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కాగా అధికారులు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆఫీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. గడిచిన వారం రోజుల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవడంతో ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement