Friday, April 26, 2024

భారత హాకీ జట్టుపై బాలయ్య ప్రశంసలు

కాంస్య పతకం సాధించిన భారత హాకీజట్టుకు శుభాభినందనలు తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. భారతదేశానికి 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీ క్రీడకు పతకం రావడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. పతకం సాధించిపెట్టి దేశ ప్రతిష్టను చాటిచెప్పిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియచేస్తున్నాను.

హాకీ జట్టు కఠోర శ్రమతోనే పతకం లభించింది. దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా వుంటాయి. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారు. ఒలంపిక్స్ లో ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు బాలయ్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement