Wednesday, May 1, 2024

ఛ‌త్ర‌ప‌తితో బాలీవుడ్ లోకి బెల్లంకొండ శ్రీనివాస్.. ట్రైల‌ర్ రిలీజ్

బాలీవుడ్ లో తెర‌కెక్కుతోంది తెలుగు చిత్రం ఛ‌త్ర‌ప‌తి.. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలకు రెడీ అవుతోంది. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా .. రీమేకులను .. భారీ బడ్జెట్ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడనే మంచి పేరు వినాయక్ కి ఉంది. అందువల్లనే ఈ రీమేక్ ఆయన చేతికి వెళ్లింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మెయిన్ కంటెంట్ కి తగినట్టుగానే యాక్షన్ సీన్స్ పైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. పెన్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాలో నుష్రత్ కథానాయికగా నటించగా, భాగ్యశ్రీ కీలకమైన పాత్రను పోషించింది. ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి. కాగా 2005లో విడుద‌ల‌యింది ఛ‌త్ర‌ప‌తి మూవీ. ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథను అందించ‌గా .. ద‌ర్శ‌కుడు రాజమౌళి తెరకెక్కించారు. ఈ చిత్రంలో స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement