Thursday, May 2, 2024

అభిమాని కోరిక తీర్చిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అభిమాని కోరిక మేరకు స్వయంగా వెళ్లి కలిశారు. సోషల్ మీడియా వేదికగా మార్చి 13న శ్రీమతి సుదర్శన్ బొడ్డు ఓ పోస్ట్ పెట్టారు. నమస్కారములు రామ్ చరణ్ గారు… నా పేరు శ్రీమతి సుదర్శన్ బొడ్డు. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని నేను….. ఊడ్చే చీపురు పుల్లలతో మీ యొక్క డ్రీమ్ హౌస్ ని నిర్మించాను. దీనిని మీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అనుమతి ఇస్తే కలిసి ఇవ్వాలని నా కోరిక అంటూ ఆమె పోస్ట్ చేశారు.

ఇక ఆ పోస్ట్ చుసిన రామ్ చరణ్ స్వయంగా ఈ రోజు ఆమెను కలిశారు.కలిసి ఆమె మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారు. ఆమెతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాగా అది చూసిన అభిమానులు చరణ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement