Sunday, May 5, 2024

Mahesh Babu – Rajamouli: వెయ్యి కోట్ల బ‌డ్జెట్ .. మూడేళ్లు షూటింగ్

తెలుగు సినీ అభిమానులందరూ మహేశ్‌ బాబు- రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేది దర్శకదీరుడు రాజమౌళి కావడంతో ఎంతటి అంచనాలు పెట్టుకున్నా అంతే స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో మహేశ్‌ బాబు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది.

ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమంతో షూటింగ్‌ ప్రారంభించనున్నాడు జక్కన్న.వాస్తవంగా ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ ఉన్నారనే సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం ఆయనకు జక్కన్న- మహేశ్‌ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిల‌బెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్‌ మార్కెట్ భారీగా పెరిగినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు.

కానీ అడ్వేంచర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్‌ అవుతుంది. సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నారు.. అందులో దిల్ రాజు ఉండ‌గా, నెట్ ఫ్లిక్స్ కూడా వాటాదారుగా చేర‌నుంది..ఇక మూవీ షూటింగ్ పూర్తి అయి రిలీజ్ అయ్యేందుకు మూడేళ్లు ప‌డుతుంది.. అంటే మ‌హేష్ మూవీ మ‌రో మూడేళ్ల వ‌ర‌కు క‌నిపించే అవ‌కాశాలు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement