Thursday, May 2, 2024

కోల్ క‌తాలో.. భోళాశంక‌ర్ టీం

భోళా శంక‌ర్ చిత్రంతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్ గా ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్.. చిరంజీవితో కలిసి చార్టెట్ విమానంలో కలకత్తా వెళ్ళారు. మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్‌ కాంబోలో భోళా శంకర్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ త‌మిళ స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్. కీర్తి సురేష్ చెల్లిగా, తమన్నా హీరోయిన్‌గా ఈ సినిమాలో చిరంజీవి పక్కన కనిపించనున్నారు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, మెహర్ రమేష్ ..చిత్ర యూనిట్ అంతా కూడా కోల్‌కతా చేరుకుంది. ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సిడ్రైవర్‌గా కనిపించబోతున్నార‌. ఈ సినిమా కథ కొంత భాగం కోల్‌కత్తాలోనే జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement