Thursday, May 2, 2024

వింటేజ్ లుక్ మెగాబాస్…

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇటీ-వల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్‌ ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ను పూర్తి చేసారు. దానితో 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకుడు. మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్‌ మాస్‌ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. వీటిలో చిరంజీవి గ్రే కలర్‌ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్‌ లో టీ- -టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. కీర్తి సురేష్‌, తమన్నా, వెన్నెల కిషోర్‌ తదితరులు పాల్గొనే ముఖ్యమైన సన్నివేశా లను చిత్రీకరించనున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ కోల్‌కత్తాలో జరుగతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూరప్‌ వెళతారు. యూరప్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్‌, -్లకె-మాక్స్‌ షూట్‌, భారీ సెట్‌ సాంగ్‌ చిత్రీకరిస్తాం. దాంతో జూన్‌ నెలాఖరుకు సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవే గంగా జరుగుతున్నాయి.క్రియే టివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement