Sunday, April 28, 2024

భీమ్లా నాయక్ ప్లానింగ్@ త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇది సోషల్ మీడియాలో నయా రికార్డులను సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8 మిలియన్ల ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన వీడియో గా నిలిచింది.

ఇదిలా ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సినిమాకు భీమ్లా నాయక్ సినిమా కు లింక్ అప్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదెలా అనుకుంటున్నారా 2019 ఆగస్టు 15 న అలా వైకుంఠపురం లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టైటిల్ ను రిలీజ్ చేశారు. అలాగే జనవరి 12న రిలీజ్ చేశారు. అదే విధంగా జనవరి 12న భీమ్లా నాయక్ కూడా రిలీజ్ కాబోతోంది. అయితే దీనికి కారణం త్రివిక్రమ్ అనే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమే అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement