Thursday, May 2, 2024

Pooja : నందినిరెడ్డి మూవీలో బుట్ట బొమ్మ

టాలీవుడ్‌ లో చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి కెరీర్ ఆరంభంలో పెద్దగా సక్సెస్ లను దక్కించుకోలేక పోయిన పూజా హెగ్డే ఎప్పుడైతే అల్లు అర్జున్ కి జోడీగా డీజే టిల్లు సినిమాలో నటించిందో అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది.

పెద్ద హీరోల సినిమాలు కమిట్ అవ్వడం తో కొందరు హీరోలకు డేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్క సినిమా ఆఫర్‌ కూడా చేతిలో లేని పరిస్థితికి పూజా హెగ్డే వచ్చింది. గుంటూరు కారం, ఉస్తాద్‌ భగత్‌సింగ్ సినిమాలతో పాటు రెండు హిందీ సినిమాల్లో కూడా నటించే అవకాశం దక్కినట్లే దక్కి మిస్ అయ్యింది. ఇలాంటి సమయంలో పూజా హెగ్డే కి తెలుగు లో ఓ ఆఫర్ తలుపు తట్టిందనే వార్తలు వస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. కీలక పాత్రలో సమంత ను తీసుకోవడం జరిగింది. కథ నచ్చడంతో పాటు నందిని రెడ్డి తో ఉన్న సన్నిహిత్యంతో సమంత నటించేందుకు ఓకే చెప్పింది. సమంత పలు కారణాల వల్ల ఏడాది బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే. దాంతో ఆమె వచ్చిన తర్వాత సిద్దు, నందిని రెడ్డి సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సమంత వచ్చే వరకు వెయిట్‌ చేయకుండా.. ఆమె ప్లేస్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే తో లాంగించేయాలని నందిని రెడ్డి నిర్ణయించుంది..ఈ విధంగా స‌మంత ప్లేస్ మ‌ళ్లీ బుట్ట‌బొమ్మ టాలీవుడ్ లో కాలు మోపుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement