Monday, May 6, 2024

ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తా, ఆయనే స్ఫూర్తి …బాలకృష్ణ

విశ్వవిఖ్యాత ,నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ….ఎన్టీఆర్ ఎప్పుడు మనతోనే ఉంటారని… తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు బాలకృష్ణ.

ఇక ఎన్టీఆర్ జీవితం పై నేనే ఒక పుస్తకం రాస్తానని ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని బాలకృష్ణ అన్నారు. అలాగే కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయుర్వేదంపై నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కార్మికుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఆయన స్ఫూర్తి నన్ను నడిపిస్తోందని ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement