Tuesday, May 21, 2024

దృశ్యం మూవీకి మ‌రో సీక్వెల్‌.. ‘దృశ్యం-3, ది కంక్లూజ‌న్’ పేరిట పోస్ట‌ర్ రిలీజ్‌

దృశ్యం-3 ది కంక్లూజన్ సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ లాల్, మీనా కాంబినేషన్‌లో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇక రెండో పార్ట్ కూడా అందరినీ మెప్పించింది. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ మూవీని చూసి కథ, కథనాలు తెరకెక్కించిన విధానానికి మురిసిపోయి జీతూ జోసెఫ్‌ను ఆకాశానికెత్తేశాడు. అలాంటి సినిమాకు ఇప్పుడు మూడో పార్ట్ రాబోతున్న‌ట్టు స‌మాచారం.

ఈమేరకు ఓ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దృశ్యం 3 ది కంక్లూజన్ అంటూ రాబోతోన్న ఈ చిత్రంతో ముగింపు ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ చేస్తూ తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇక మోహన్ లాల్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కొత్త కాన్సెప్టులను ఎంచుకుంటూ అందరినీ అలరిస్తూ వస్తున్నాడు.

దృశ్యం, 12th man అనే చిత్రాలు ఓటీటీలో ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు దృశ్యం 3 చిత్రంతో మోహన్ లాల్ మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. దీని కోసం జీతూ జోసెఫ్ మరో అద్బుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. అసలే సీటు అంచున కూర్చోబెట్టి చూసేలా చేయడంలో జీతూ జోసెఫ్ నేర్పరి. దృశ్యం రెండు పార్టులను కూడా అంతే ఉత్కంఠను రేపేలా తెరకెక్కించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement