Wednesday, May 8, 2024

రష్మిక కు బాలీవుడ్ లో మరో అవకాశం

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక మందన్న. ఇక గతేడాది వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సిద్ధార్థ మల్హోత్రా మిస్టర్ మజ్ను చిత్రంలో నటిస్తోంది. మరోవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గుడ్ బాయ్ సినిమాలో కూడా నటిస్తుంది.

అంతేకాకుండా రాంచరణ్ శంకర్ సినిమాలో కూడా రష్మికను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా రష్మిక కు మరో బంపర్ ఆఫర్ వచ్చిందట.ఏకంగా మరో బాలీవుడ్ సినిమాలో రష్మీక ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఈ విషయంపై స్వయంగా ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఆమె ప్రకటించారు. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నా… త్వరలోనే మూడో సినిమాను కూడా అంగీకరించబోతున్నాం అని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement