Thursday, May 2, 2024

పుష్ప షూటింగ్ పై మరో లేటెస్ట్ అప్డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో అల్లు అర్జున్ ఉన్నారు. అయితే అల్లుఅర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. గందపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ ను వాయిదా వేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈచిత్రానికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం మొదటి పార్టుకు ఇంకా నెల నుంచి నెలరోజులు బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement