Friday, April 26, 2024

ఆదిపురుష్ లో మరోపాత్ర బయటకు వచ్చింది…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సీతగా కృతిసనన్ కనిపించనుంది. ఇక రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల కరోనా కారణంగా ఆదిపురుష్ యూనిట్.. ముంబై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మేఘనాధుడు పాత్రకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సిద్ధార్థ్ శుక్లాను అనుకుంటున్నారట. అయితే అధికారికంగా మాత్రం దీనికి సంబంధించి ప్రకటన రాలేదు. మరి అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement