Friday, May 3, 2024

దుర్గమ్మను దర్శించుకున్న అల్లరి నరేష్ దంపతులు..

హీరో అల్ల‌రి న‌రేష్ దంప‌తులు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ద‌ర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నరేష్‌ దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్ర‌త్యేదిక పూజ‌లు త‌ర్వాత వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వ్రస్తాలు బహూకరించారు. ఇటీవల నాంది చిత్రం విజయాన్ని అందుకున్నాడు నరేష్. తాజాగా “సభకు నమస్కారం” పేరుతో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం కాగా, చిత్రాన్ని సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ గా దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడట. యువ నటుడు నవీన్ చంద్ర “సభకు నమస్కారం”లో ఒక ముఖ్యమైన పాత్రలో న‌వీన్ చంద్ర న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక మంచు మ‌నోజ్ న‌టిస్తున్న అహం బ్ర‌హ్మాస్మి చిత్రంలో అల్ల‌రి న‌రేష్ న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఇది కూడా చదవండి: చక్ దే ఇండియా: గోల్డ్ తీసుకురండి చాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement