Wednesday, April 24, 2024

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన థమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను అమాంతం పెంచగా… మరో అప్డేట్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో ఉత్కంఠను రేపారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. త్వరలోనే ఈ సినిమా మొదటి పాట విడుదల అవుతుందని ప్రకటించాడు. అసలైన మాస్ ఇదే. ఇది మన లీడర్ పవన్ కళ్యాణ్ కోసం అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై రచయిత రామజోగయ్య శాస్త్రి కామెంట్ చేస్తూ… దిష్టి తగులుతుంది. ఇప్పుడు నేను ఏమి చెప్పను… మీరే అర్థం చేసుకోండి అంటూ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement