Tuesday, April 30, 2024

Ambలో ఆదిపురుష్ టీమ్.. సందడి చేసిన ప్రభాస్ అభిమానులు

రెబల్ స్టార్, పాన్ వ‌ర‌ల్డ్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓంరౌత్ తెర‌కెక్కించిన పౌరాణింక చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలీజైన టీజర్ ఫ్యాన్స్ ను నిరాశ పరచగా, ఇప్పుడు ఈ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్లు, జై శ్రీ రామ్ పాట‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు హైప్‌ని మ‌రింత స్థాయికి తీసుకెళ్లాయి.

ఆదిపురుష్ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో ప్రదర్శించారు మేక‌ర్స్. ఇక ఈ ట్రైలర్ ని చూసేందుకు AMB మాల్ కి వ‌చ్చిన‌ ప్రభాస్ ని చూసి అభిమానులు సందడి చేశారు. గతంలో రిలీజ్ అయిన టీజర్ గ్రాఫిక్స్ విషయంలో భారీ ట్రోలింగ్ కి గురైంది. దీంతో VFX వర్క్స్ ని మెరుగు పరుచుకునేందుకు వెనక్కి వెళ్లి వెళ్లిన సంగతి తెలిసిందే

కాగా, రేపు (మే 9) సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా ట్రైల‌ర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 70 దేశాల్లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. 3D ట్రైలర్ ని స్పెషల్ గా థియేటర్స్ లో స్క్రీనింగ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement