Monday, April 29, 2024

ఏప్రిల్ 12న మేజర్ వచ్చేస్తున్నాడు

అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మేజర్. ముంబై నగరంలో జరిగిన ఉగ్రదాడులు లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేషు నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమాను సోనీ పిక్చర్స్ , జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

గతం లో క్ష‌ణం, గూఢ‌చారి, ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో వరుస హిట్లను అందుకున్నా అడవి శేషు… ఈ సినిమాతో పాటు హిట్ 2 లో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement