Wednesday, May 15, 2024

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అదా శర్మ.. కార‌ణ‌మిదే!

రీసెంట్ గా కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ అదా శర్మ. ఈ సినిమాపై విమర్శలు వచ్చినా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే, ఇవ్వాల (బుద‌వారం) తీవ్ర అస్వస్థతకు గురైంది.. దీంతో ఆమె ఆస్ప‌త్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

అదా శర్మ తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కమాండో అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె భావనారెడ్డి పాత్రలో నటిస్తోంది. ఈ సిరీస్‌లో నటి అదాతో పాటు, ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ది కేరళ స్టోరీ’ సక్సెస్ తర్వాత అదాశర్మ న‌టిస్తోన్న‌ వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కి విపుల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement