Tuesday, April 30, 2024

ప‌ది..ఇంట‌ర్ లో టాప‌ర్స్..ఆరుగురుని స‌న్మానించిన హీరో విజ‌య్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సామాజిక‌సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుంటారు. రాష్ట్రంలోని తన అభిమాన సంఘాల ద్వారా సమాజానికి సేవ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది తమిళనాడులోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10వ తరగతి టాపర్‌లు ముగ్గురు, ఇంటర్మీడియట్‌ టాపర్‌లు ముగ్గురు చొప్పున ఆరుగురుని చెన్నైకి పిలిపించి సన్మానించారు ఈ హీరో. విద్యార్థులందరికీ శాలువాలు కప్పి సత్కరించారు. ప్రోత్సాహక సర్టిఫికెట్‌లను అందజేశారు..ఈ సన్మాన కార్యక్రమానికి ఎలాంటి హంగులు, ప్రచార ఆర్భాటాలు వద్దని నటుడు విజయ్‌ ముందే తన అభిమానులకు చెప్పారు. ప్రచారం కోసం ఎలాంటి హంగామా చేయకుండా నిరాడంబరంగా కార్యక్రమం జరిగేలా చూడాలని కోరారు. దాంతో విజయ్‌ కోరుకున్నట్టే ఫ్లెక్సీలు, బ్యానర్‌లు, ఇతర ఆర్భాటాలు లేకుండా అభిమానులు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.కాగా చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement