Monday, April 29, 2024

ముగిసిన శ‌ర‌త్ బాబు అంత్య‌క్రియ‌లు

బంధువులు..స‌న్నిహితులు..అభిమానుల అశ్రున‌యనాల మ‌ధ్య సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు అంత్య‌క్రియ‌లు ముగిశాయి.
చెన్నైలో శ‌ర‌త్ బాబు అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు చెన్నై టీనగర్ లోని తన నివాసంలో శరత్ బాబు భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. న‌టులు రజనీకాంత్, సుహాసిని, శరత్ కుమార్, రాధిక తదితర పలువురు ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయ‌న నివాసం నుంచి గిండి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని శ్మశానవాటికకు తరలించి, అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement