Friday, May 17, 2024

మంగళవారంలో తొలి పాట విడుదలైంది

YouTube video

‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మంగళవారం’. పాయల్‌ రాజ్‌పుత్‌ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి తొలి పాట ”గణగణ మోగాలిరా…” విడుదల చేశారు.

జాతర నేపథ్యంలో గణగణ మోగాలిరా… పాటను తెరకెక్కించారు. బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా… వి.ఎం. మహాలింగం ఆలపించారు. ఇప్పటికే విడుదలైన మంగళవారం టీ-జర్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించింది. కథపై ఆసక్తి కలిగించింది

.

నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం మాట్లాడుతూ ”కథలో కీలక సందర్భంలో గణగణ మోగాలిరా పాట వస్తుంది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. అని చెప్పారు.

చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ ” అజనీష్‌ లోక్‌నాథ్‌ అద్భుతమైన బాణీ అందించారు. కొన్నేళ్ళ పాట జాతరలలో ఈ పాట వినిపిస్తుంది. మా కథను కూడా చెప్పే పాట ఇది. ఇక సినిమా విషయానికి వస్తే… గ్రామీణ నేపథ్యంలో మన తెలుగు నేటివిటీ-తో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. అని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement