Saturday, May 4, 2024

కరోనా పై పోరాటానికి అక్షయ్ కుమార్ సహాయం

దేశం లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. లక్షల కేసులు నమోదవుతున్నాయి. అలాగే వేలాది మంది చనిపోతున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, భార్య ట్వింకిల్ ఖన్నా కరోనా సంక్షోభంపై పోరాటానికి ముందుకు వచ్చారు.

తాజాగా 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను డొనేట్ చేశారు. అంతేకాకుండా కరోనా పోరాటానికి ఎవరు ఏం చేయగలిగితే అది చేయాలని ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు తమ కుటుంబం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నామని అన్నారు. ఇక ఇటీవల అక్షయ్ కుమార్ ముంబై ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement