Sunday, May 12, 2024

శ్రీవారి సేవలో ‘ఉప్పెన’ టీం..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉప్పెన చిత్రం యూనిట్. హీరో వైష్ణవ్ తేజ్..కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఇది. వందకోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది ఉప్పెన. డెబ్యూ హీరోల్లోనే రికార్డ్ బ్రేకింగ్ హీరోగా వైష్ణవ్ రికార్డులకెక్కాడు. ఇక బుచ్చిబాబు సన అయితే స్టార్ల ప్రశంసలతో మబ్బుల్లో తేల్తుండగా.. క్రైసిస్ లోనూ మైత్రి సంస్థ భారీగా లాభాలార్జిస్తోంది. మొత్తానికి ఈ విజయాన్ని పురస్కరించుకుని పాత మొక్కుబడుల్ని తీర్చుసుకుంటోంది మైత్రి సంస్థ. నేడు ఉప్పెన టీమ్ తిరుమలేశుని చెంత ప్రత్యక్షమయ్యారు. కాలి నడకన వెంకటేశుని దర్శించుకుంది ఉప్పెన చిత్రబృందం. హీరో వైష్ణవ్ తేజ్- హీరోయిన్ కృతి శెట్టి- నిర్మాత నవీన్- డైరెక్టర్ బుచ్చిబాబు తదితరులు తిరుమల శ్రీవారిని వీఐపీ కేటగిరీలో దర్శించుకుని అనంతరం మీడియాకి చిక్కారు. ప్రస్తుతం ఉప్పెన టీమ్ కాలినడక దర్శనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఉప్పెన టీంతో పాటు తుడా చైర్మన్ చెవి రెడ్డి కూడా దైవదర్శనంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement