Friday, April 26, 2024

ముంబైలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేసిన ‘రష్మిక’

ముంబైలో ఖరీదైన ప్లాట్ ని కొనుగోలు చేసిందట హీరోయిన్ రష్మిక మందన. మిషన్ మజ్ను చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది రష్మిక. ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్ మల్హోత్రా.  హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై ఫోక‌స్ పెట్టాల‌నుకుంటున్న ర‌ష్మిక‌..దీని కోసం స్పెష‌ల్‌గా ట్యూట‌ర్ ను కూడా పెట్టుకోవాల‌నుకుంది. ఈ భామ ముంబైలో ఖ‌రీదైన ప్లాట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు బీటౌన్‌లో వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కుముందు ర‌ష్మిక ముంబై వెళ్లిన‌ప్పుడు హోట‌ల్స్ లో బ‌స చేసేది. ఇపుడు సొంత‌గూడు చూసుకోవ‌డంతో సంతోషంలో మునిగితేలుతుందట. ఇదిలా ఉంటే ర‌ష్మిక ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో విలాస‌వంత‌మైన ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. మిష‌న్ మ‌జ్ను చిత్రం త‌ర్వాత డెడ్లీ ప్రాజెక్టు చేయ‌నుంది ర‌ష్మిక‌. ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌బచ్చ‌న్ లీడ్ రోల్‌లో న‌టించ‌బోతున్నారు.మ‌రోవైపు తెలుగులో ర‌ష్మిక న‌టిస్తోన్న పుష్ప ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మొత్తానికి మెట్రో పాలిట‌న్ సిటీస్ హైద‌రాబాద్‌, ముంబైలో సొంతిళ్లు కొనుగోలు చేసి..రెండు, చోట్లా త‌న హ‌వా న‌డిపించాల‌నుకుంటోందీ బ్యూటీ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement