Sunday, May 12, 2024

మీ ఆశీస్సులు పొందినందుకు ఆనందంలో తేలిపోతున్నా..

మెగాస్టార్ చిరంజీవి ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి ఓ గిఫ్ట్ ని పంపారట. దాంతో ఉప్పెన బ్యూటీ తెగ మురిసిపోతోందట. ఈ మధ్యే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కు లెటర్ తో పాటు ఓ గిఫ్ట్ ను కూడా పంపారు చిరు. ఈ విషయాన్ని దేవి శ్రీ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.  ఇక చిత్ర హీరోయిన్ కృతి శెట్టికు కూడా చిరు లేఖ పంపారు. ఆ లేఖ‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్య‌క్తం చేసింది కృతి. లేఖ‌లో పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళిస్తుంది అన్న దానికి నువ్వొక ఉదాహ‌ర‌ణ‌. స్టార్ కావ‌డం కోస‌మే నువ్వు పుట్టావు. భాష తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ , పాత్ర‌లో అద్భుతంగా జీవించావు. బేబ‌మ్మ పాత్రను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. మంచి విజ‌యాల‌ను సాధించ‌కుంటూ ఇలానే ముందుకు సాగిపో అని చిరు లేఖ‌లో పేర్కొన్నారు. చిరు లేఖ‌పై స్పందించిన కృతి శెట్టి.. చిరు స‌ర్ థ్యాంక్యూ.. మీ మాట‌లు నా హృద‌యాన్ని తాకాయి. మీరు  పంపిన గిఫ్ట్‌, మీ మాట‌లు ఎప్ప‌టికీ నా హృద‌యంలో నిలిచిపోతాయి. మీ ఆశీస్సులు పొందినందుకు ఆనందంలో తేలిపోతున్నా అని పేర్కొంది కృతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement