Sunday, May 5, 2024

‘పుష్ప’ సెట్ లోనే ‘ఆచార్య’ షూట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య నెక్స్ట్ షెడ్యూల్ ని మారేడుమిల్లి ఫారెస్ట్ లో ప్లాన్ చేసారు.. ఇదివరకే అక్కడ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ జరిగింది..  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ మారేడుమిల్లి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది యూనిట్. ఈ టీమ్ తిరిగి హైద్రాబాద్ వస్తున్నా సమయంలోనే అల్లు అర్జున్ బస్సు కు ఆక్సిడెంట్ జరిగింది.మారేడు మిల్లిలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో పుష్ప షూటింగ్ ని జరిపారు. ఆ సెట్స్ కె ఇప్పుడు ఆచార్య కూడా వెళ్తున్నాడు..  పుష్ప షూటింగ్ ముగిసాకా అక్కడికి ఆచార్య వెళ్లడం ఎందుకు అని అనుకుంటుంన్నారా  దానికి కారణం ఏమిటంటే .. ఇప్పుడు అదే సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ ను జరిపేందుకు టీం అక్కడికి ప్రయాణం కానుంది.  అది విషయం.  ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ సెట్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు చ‌ర‌ణ్‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. అందుకోసం ఆచార్య టీమ్ మారేడుమ‌ల్లిలోని `పుష్ష‌` సెట్లోకి అడుగుపెట్ట‌బోతోంది. పుష్ష షూటింగ్ జ‌రిగిన ప్ర‌దేశంలోనే… `ఆచార్య‌` కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement