Saturday, May 18, 2024

జూన్ 4న ‘రిపబ్లిక్’..షూట్ కంప్లీట్

దర్శకుడు దేవాకట్టా తెరకెక్కిస్తోన్న చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో సాయితేజ్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూట్ పూర్తయింది. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కాగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ చిత్రంలో ప్రతినాయకురాలిగా నటిస్తోంది. ఈ సినిమాపై ముందు నుంచి కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నాడు సాయి తేజ్. తన కెరీర్ లో స్పెషల్ సినిమా అవుతుందని నమ్మకంగా చెప్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్ సైతం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దర్శకుడు దేవా కట్టా. ఈయనకు ఈ మధ్య కాలంలో హిట్ లేదు. పదేళ్ల కింద వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ సినిమా లేదు. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా కూడా చాలా వేగంగా రిపబ్లిక్ సినిమాను పూర్తి చేసాడు సాయి. జూన్ 4న సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement