Monday, May 20, 2024

కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొందాం..

కోటి వృక్షార్చన కార్యక్రమానికి అండగా ఉందామని పిలుపునిచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు.భూతాపం తగ్గించడం మనవల్లే సాధ్యం అవుతుందని మహేశ్‌ బాబు అన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి చేరకుండా పరిమితం చేయవచ్చని తెలిపారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తీసుకున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి అండగా ఉందామని ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.  ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొందామని ట్వీట్‌ చేశారు. తనతో పాటు కూతురు, కొడుకు మొక్కలు నాటుతుండగా తీసిన వీడియోను షేర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement